Saturday, January 25, 2020

హరితలోగణతంత్రదినోత్సవ వేడుకలు(26-1-2020)

హరితలోగణతంత్రదినోత్సవ  వేడుకలు
 26-1-2020 
హరితావరణ విద్యా పీఠం లో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది . విద్యార్థులు పతాక వ్యాయామం ,పదసంచలనం,శరీరసంచలనం,కరాటే ,కోలాటం ,యోగ చాప్ ,బ్యాండ్, చక్రభ్రమణం, రంగులరాట్నం,కదంబ బాలభువనవిజయం  తదితరాలు ప్రదర్శించారు . అనేక దేశభక్తిగీతాల ఆలపించారు. జాతీయ జెండా ఎగురవేసిన విశ్రాంత తహసీల్దారు ఆర్. సత్యనారాయణ గారు అమర వీరులకు శ్రద్ధాంజలి సమర్పించి, స్వాతంత్య్రఉద్యమాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవితచరిత్రల్ని విద్యార్థులే చెప్పారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ఉపాధ్యాయులతోబాటు, హరితావరణ విద్యా పీఠం నిర్వాహకులు శ్రీమతి పి . ఉషారాణి, డాక్టర్ సుధాకర్ గారు,హరిత  పూర్వ విద్యార్థులు, స్థానిక  ప్రాంతాలనుండి ప్రజలు కూడా పాల్గొన్నారు. 


No comments:

Post a Comment