ఆత్మీయు లందరికీ ఆహ్వానం
ఆదివారం, మే 29, 2016
ఓ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నాము.
వీలుచేసుకొని ఈ సమావేశంలో పాల్గొనగలరని ఆశిస్తున్నాము.
ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది ...
కొందరు
పూర్వ విద్యార్థులు, పూర్వ సిబ్బంది, విద్యారంగంలో విద్యా పీఠం చేస్తున్న
కృషిని, సేవల్ని గుర్తించినవారు .... సంవత్సరం పొడవునా అప్పుడప్పుడూ
వస్తూ, పోతూ ఉంటారు. విద్యా పీఠం తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ
ఉంటారు.విద్యా పీఠం ఇంకా వృద్ధి చెందాలని కోరుకొంటూ ఉంటారు.విద్యా
పీఠానికి తాము ఏవిధంగా సహకరించ గలమంటూ స్వచ్ఛన్దంగా అడుగుతుంటారు.
ఇలా అడిగేవారికి వారి సహకారం తీసుకోడానికి ఒక పద్ధతిని ఏర్పరచలేదంటూ దాటవేస్తూ వస్తున్నాము.
27 సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాల్ని భరిస్తూ నెట్టుకొస్తున్నాము.
ఇప్పటికి మొహమాటాన్ని ప్రక్కన పెట్టి , అడిగిన వారి, అడగాలను కొంటున్నవారి, సహకారాన్ని స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చాము.
హరిత దార్శనిక పత్రాన్ని ఈ blog ద్వారా కొద్ది కొద్దిగా తెలుపుతుంటాము.
మీ అబిప్రాయాల్ని తెలిపితే తెలుసుకొంటుంటాము.
వీలున్న వారు మే 29 వ తేదిన జరిగే ఆత్మీయ సమ్మేళనానికి రండి.
రాలేని వాళ్ళు ఇతర మాద్యమాల ద్వారా సంప్రదించండి
No comments:
Post a Comment